Swarnandhra 2047 Vision Document: అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం లక్ష్యంగా స్వర్ణాంధ్ర- 2047 విజన్ డాక్యుమెంట్ను సీఎం చంద్రబాబు నేడు ప్రజల ఎదుట ఆవిష్కరించనున్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పనతోపాటు అన్నదాతల ఆదాయాన్ని పెంచుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తామనే హామీని ఇవ్వనున్నారు. రవాణా రంగంలో సౌకర్యాల కల్పన, గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యం వంటి విషయాలను తెలియజేయనున్నారు. ఉదయం 10న్నర గంటలకు విజయవాడలో జరిగే కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.