Surprise Me!

అమరావతికి రూ.64,721 కోట్లు ఖర్చు అవుతుంది: నారాయణ

2025-03-11 4 Dailymotion

Minister Narayana on Capital Amaravati: రాజ‌ధాని నిర్మాణానికి అయ్యే ఖ‌ర్చు 64,721.48 కోట్లని పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. 2028 నాటికి రాజ‌ధాని నిర్మాణం పూర్తి చేస్తామని అసెంబ్లీలో మంత్రి నారాయ‌ణ‌ స్పష్టంచేశారు. క్వశ్చన్ అవ‌ర్​లో ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి నారాయ‌ణ స‌మాధానం చెప్పారు. అమ‌రావ‌తి గ‌వ‌ర్నమెంట్ కాంప్లెక్స్(ఏజీసీ)లో ఇళ్లు, భ‌వ‌న నిర్మాణాలు, ట్రంక్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్, ఎల్పీఎస్ మౌళిక స‌దుపాయాల అభివృద్ది కోసం 64,721.48 కోట్లు ఖ‌ర్చవుతుందన్నారు. ఈ నిధుల‌ను వివిధ రూపాల్లో సేక‌రించి అమ‌రావ‌తి నిర్మాణం చేప‌డుతున్నట్లు మంత్రి నారాయణ వివరించారు.